Thank you for reading this post, don't forget to subscribe!

ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు

🔶శుక్రవారం సాయంత్రం వరకు అవకాశం

🔷తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడి

 రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్ని కల అధికారి వికాస్ రాజ్ బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సీఈసీ విధించిన గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. దానిని పొడిగించాలని వికాస్ రాజ్ లేఖ రాయడంతో సీఈసీ స్పందించి శుక్రవారం వరకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఓట్ల లెక్కింపును నిర్దేశించిన రోజున ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉదయం 7:59 వరకు పోస్టల్ బ్యాలెట్ ఉంచిన సీల్డు కవరు లెక్కింపు అధికారులకు అందజే సేందుకు గతంలో అవకాశం ఉండేది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ విధానాన్ని సీఈసీ రద్దు చేసింది. పోలింగ్ కన్నా ముందుగానే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. అందు కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధి కారులను ఆదేశించింది. ఆ మేరకు లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 2,79,519 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో సుమారు 40 వేల మంది ఎన్నికల విధుల ధ్రువ పత్రం( ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్) ద్వారా పోలింగ్ రోజునే ఓటు వేసేందుకు అంగీకరించారు. వారంతా ఆ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వారే కావటంతో అధికారులు ద్రువపత్రాలు జారీ చేశారు. మిగిలిన వారిలో బుధవారం సాయంత్రం వరకు సుమారు 1.70 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మరో 70 వేల మంది వరకు మిగిలి ఉండటంతో మరింత గడువు ఇవ్వాలని నిర్ణయించారు.

💥ఇంటి నుంచి 21 వేల మంది ఓటు

🌀వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ పూర్తయింది. ఇందుకు 23,248 మందిని అర్హులుగా గుర్తించగా.. వారిలో 21 వేల మంది ఓటు వేశారని వికాస్ రాజ్ వివరించారు.