నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Thank you for reading this post, don't forget to subscribe!

 తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

ఈ పరీక్షకు 51,237 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో 31,625 మంది అబ్బాయిలు, 19,612 మంది అమ్మాయిలు ఉన్నారు.

వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

పరీక్షలు సాజావుగా జరిగేందుకు 38 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు.

2 వేల మంది వరకూ ఇతర సిబ్బందిని నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.