EAPCET : ఈఏపీసెట్ ఫలితాలు నేడు విడుదల!

Thank you for reading this post, don't forget to subscribe!

ఇంజినీరింగ్ (Engineering), వ్యవసాయ (Agriculture), ఫార్మసీ కోర్సుల్లో (Pharmacy Course) ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.

ఈ విషయం గురించి సెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూ్‌ కాకినాడ వీసీ ప్రసాద్‌ రాజు వివరించారు.

ఈ క్రమంలోనే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ ఛార్జ్‌ చైర్మన్‌ రామమోహన్‌ రావుతో కలిసి ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల (EAPCET Results 2024) చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌ ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది.

ఈ సారి పరీక్షకు 3,62,851 మంది దరఖాస్తులు చేసుకోగా..వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ కు 2,58,373 మంది ,వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 80,766 మంది ఈ పరీక్షలు రాశారు.

ఈ పరీక్షలో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు.