నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
Thank you for reading this post, don't forget to subscribe!
🔶నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
🔷ఈ నెల 27న పోలింగు
🍥ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
శాసనమండలిలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది.
ఈ నెల 27న పోలింగు నిర్వహించి జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి గతేడాది జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.
ఈ ఉప ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు.
పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నల్గొండ జిల్లా కలెక్టర్కు నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.