టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారంతో ముగియనున్నది.
Thank you for reading this post, don't forget to subscribe!
బుధవారం సాయంత్రం నాటికి 2,64,804 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ముందుగా మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు అప్లికేషన్ల ప్రక్రియ ఉంటుందని ప్రకటించింది.
మార్చిలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో, డీఎస్సీ అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది.
కాగా, బుధవారం సాయంత్రం వరకు 2,72,798 మంది ఫీజు చెల్లించగా, 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ ఫలితాలు కూడా రిలీజ్ కావడంతో, ప్రభుత్వం డీఎస్సీ అప్లికేషన్ల సవరణకు అవకాశం ఇచ్చింది.
ఇప్పటి వరకు 64,556 మంది అభ్యర్థులు దరఖాస్తులను సవరించుకున్నారు.